
ప్రియమైన ఎన్నుకోబడిన వారలారా,
ఇదిగో, నేను తలుపునొద్ద నిలబడి, మరియు తట్టుచున్నాను: ఎవడైనను నా స్వరము విని, మరియు తలుపు తీసినయెడల, నేను అతని లోపలికి వచ్చి, మరియు అతనితో నేనును, మరియు నాతో అతడును భోజనము చేయుదుము.
పరిచర్య, ఎంతో ఆలస్యము కాకముందే దేవునియొక్క దూతకు మీ తలుపులను తెరవండి. టేపులను ప్లే చేయుట ద్వారా దేవునియొక్క స్వరమును తిరిగి మీ ప్రసంగ వేదికల మీద పెట్టండి. విఫలమవ్వని మాటలను కలిగియుండి మన దినమునకు నిర్ధారించబడిన దేవునియొక్క స్వరము అది మాత్రమేయైయున్నది. అది మాత్రమే యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును కలిగియున్న స్వరమైయున్నది. వధువు అందరూ ఆమేన్ అని చెప్పగల ఏకైక స్వరము అదేయైయున్నది.
అన్ని కాలములలోకల్లా ఇది అత్యంత గొప్ప కాలమైయున్నది. ఆయనయొక్క కృపా దినములు ముగిసిపోతుండగా యేసు స్వయంగా తనను గూర్చిన వివరణను మనకు ఇస్తున్నాడు. కాలము ఒక ముగింపునకు వచ్చినది. ఈ చివరి కాలములో ఆయన తన స్వంత గుణలక్షణములను మనకు బయలుపరచుకున్నాడు. కృపగలదియు అత్యున్నతమైనదియునైన ఆయనయొక్క స్వంత దైవత్వము వైపునకు ఒక్క చివరి దృష్టిని ఆయన మనకు ఇచ్చాడు. ఈ కాలము స్వయంగా ఆయన తలరాయి ప్రత్యక్షతయైయున్నది.
ఈ లవొదికయ కాలములో దేవుడే వచ్చి మరియు మానవ శరీరము ద్వారా మాట్లాడినాడు. ఆయనయొక్క వాక్య వధువును నడిపించడానికి మరియు పరిపూర్ణురాలిగా చేయడానికి ఆయన స్వరము రికార్డు చేయబడి మరియు భద్రపరచబడినది. ఆయన స్వంత స్వరము కాకుండా ఆయనయొక్క వధువును పరిపూర్ణురాలిగా చేయగల మరే ఇతర స్వరము అసలు లేనేలేదు.
ఈ చివరి కాలములో, టేపులలో ఉన్న ఆయనయొక్క స్వరము ప్రక్కకు పెట్టివేయబడినది; సంఘములలో నుండి బయటకు తీసివేయబడినది. వారు అసలు టేపులను ప్లే చేయరు. కావున దేవుడు ఇట్లు చెప్పుచున్నాడు, “నేను మీ అందరికీ విరోధినగుచున్నాను. నేను మిమ్మల్ని నా నోటి నుండి ఉమ్మివేస్తాను. ఇదే అంతము.”
“ఏలయనగా ఏడిటికి ఏడు కాలములలోను, మనుష్యులు నా మాట కంటెను వారి స్వంత మాటనే లక్ష్యపెట్టుటను తప్ప నాకు మరేమియు కనబడలేదు. కావున ఈ కాలము యొక్క ముగింపులో నేను నా నోటి నుండి మిమ్మును ఉమ్మివేయుచున్నాను. ఇక అంతా అయిపోయినది. నేను అంతా సత్యమునే మాట్లాడబోవుచున్నాను. అవును, నేను ఇక్కడ సంఘము మధ్యన ఉన్నాను. నమ్మకమైనవాడు, సత్యవంతుడునైన దేవునియొక్క ఆమేన్ అనువాడు తననుతాను బయలుపరచుకుంటాడు మరియు అది నా ప్రవక్త వలన జరుగును.”
ముందు జరిగినట్లు, అహాబు దినములలో వారి పితరులు ప్రవర్తించినట్లే వీరును ప్రవర్తించుచున్నారు. వారు నాలుగువందల మంది ఉన్నారు మరియు వారందరూ ఏకీభావంతో ఉన్నారు; మరియు వారందరూ ఒకే విషయమును చెప్పుట ద్వారా, వారు ప్రజలను వెర్రివారిగా చేశారు. కానీ దేవుడు ఒక్కనికి మాత్రమే ప్రత్యక్షతను అప్పగించాడు గనుక ఒక్క ప్రవక్త, కేవలం ఒక్కడు మాత్రమే, సరియైయున్నాడు మరియు ఆ మిగతావారందరూ తప్పైయున్నారు.
పరిచర్యలన్నీ తప్పని మరియు అవి ప్రజలను వెర్రివారీగా చేస్తున్నాయని దాని అర్థం కాదు. లేదా సేవ చేయడానికి పిలుపును కలిగియున్న ఒక పురుషుడు బోధించకూడదని లేదా ఉపదేశించకూడదని కూడా నేను చెప్పడంలేదు. నేను చెప్తున్నదేమనగా నిజమైన ఐదు-రకముల పరిచర్య, టేపులను, దేవుని స్వరమును, మీరు తప్పక వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరముగా వధువునకు ఇస్తుంది. టేపులలో ఉన్న స్వరము మాత్రమే యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నదని స్వయంగా దేవునిచేత నిర్ధారించబడిన స్వరమైయున్నది.
అబద్ధ ప్రవక్తల విషయమై జాగ్రత్తగా ఉండండి, ఏలయనగా వారు క్రూరమైన తోడేళ్ళైయున్నారు.
ఈ దినమునకు సరియైన మాగ్రమును మీరు నిశ్చయంగా ఎలా తెలుసుకుంటారు? విశ్వాసుల మధ్య ఎంతో విభజన ఉన్నది. ఒక గుంపు ప్రజలేమో ఐదు-రకముల పరిచర్య వధువును పరిపూర్ణము చేస్తుంది అని చెప్తున్నారు, మరి ఇంకొకరేమో కేవలం ప్లేను నొక్కండి అని చెప్తున్నారు. మనము విభజన చేయబడుటకు లేము; మనము ఒక్క వధువుగా ఏకమవ్వుటకు ఉన్నాము. సరియైన సమాధానము ఏమిటి?
మనం కలిసి మన హృదయములను తెరచి మరియు తన ప్రవక్త ద్వారా తన వధువునకు దేవుడు ఏమి చెప్తున్నాడో విందాము. ఏలయనగా, సహోదరుడు బ్రెన్హామ్ గారు ఆయనయొక్క ఏడవ దూత వర్తమానికుడైయున్నాడని మనమందరమూ ఏకీభవిస్తున్నాము.
కేవలం మానవ నడవడిని ఆధారము చేసుకొనుటవలనే ఎక్కడైతే అనేకమంది ప్రజలు ఉంటారో అక్కడ వారందరూ కలిసి పట్టుకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన సిద్ధాంతములోని తక్కువ విషయాల పైన, సమముగా విభజించబడిన అభిప్రాయము ఉండునని ఎవరికైనా తెలియును. అలాగైతే ఈ చివరి కాలము స్వచ్ఛమైన వాక్యవధువు ప్రత్యక్షపరచబడుటకు తిరిగి వెనకకు వెళ్ళుచున్నది గనుక, ఈ చివరి దినములో పునరుద్ధరించబడవలసయున్న విఫలము కాలేని ఆ శక్తిని ఎవరు కలిగియుంటారు? దాని అర్థమేమిటనగా పౌలుయొక్క దినములలో అది ఏ విధముగా పరిపూర్ణముగా ఇవ్వబడినదో, ఏ విధముగా పరిపూర్ణముగా గ్రహించబడినదో తిరిగి అదే విధముగా మరలా ఒకసారి వాక్యమును మనము పొందుకుంటాము. దానిని ఎవరు కలిగియుంటారో నేను మీకు చెప్తాను. అది అంతే బాగుగా నిర్ధారించబడిన ఒక ప్రవక్త లేదా హనోకు నుండి ఈ దినమువరకు అన్ని కాలములలోనుండిన ఏ ప్రవక్త నిర్ధారించబడినదానికంటెను ఎంతో ఎక్కువగా నిర్ధారించబడిన ఒక ప్రవక్తయైయుంటాడు, ఎందుకనగా అవసరమండుటను బట్టి ఈ మనుష్యుడు తలరాయియొక్క ప్రవచనాత్మక పరిచర్యను కలిగియుంటాడు, మరియు దేవుడిని చూపిస్తాడు. అతడు తన కొరకు మాట్లాడుకోవలసిన అవసరంలేదు, సూచనయొక్క స్వరముచేత దేవుడే అతని కొరకు మాట్లాడతాడు. ఆమేన్.
తద్వారా, ఆయనయొక్క వర్తమానికుని ద్వారా పలుకబడిన ఈ వర్తమానము పరిపూర్ణముగా ఇవ్వబడినది, మరియు పరిపూర్ణముగా గ్రహించబడినది.
ఏడవ దూత వర్తమానికుని గురించి మరియు ఆయన వర్తమానము గురించి దేవుడు ఇంకేమి చెప్పాడు?
• ఆయనదేవునియొద్ద నుండి మాత్రమే వింటాడు.
• ఆయన “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు” ను కలిగియుండి మరియు దేవుని కొరకు మాట్లాడతాడు.
• ఆయన దేవుని బూరగా ఉంటాడు.
• ఆయన, మలాకీ 4:6 లో ప్రకటించబడినట్లు, పిల్లల హృదయములను తండ్రులు తట్టుకు త్రిప్పుతాడు.
• ఆయన అంత్య దినములో ఎన్నుకోబడినవారిని తిరిగి తీసుకొనివస్తాడు మరియు పౌలు వద్ద అది జరిగినట్లే ఒక నిర్ధారించబడిన ప్రవక్త వారికి ఖచ్చితమైన సత్యమును ఇవ్వడాన్ని వారు వింటారు.
• ఆయన వారు కలిగియున్న విధంగా సత్యమును పునరుద్ధరిస్తాడు.
మరియు పిదప ఆయన మన గురించి ఏమి చెప్పాడు?
మరియు ఆ దినమున అతనితోనున్న ఆ ఏర్పరచబడినవారే ప్రభువును నిజముగా ప్రత్యక్షపరచి మరియు ఆయన శరీరముగా ఉండి మరియు ఆయన స్వరముగా ఉండి మరియు ఆయన కార్యములను ప్రదర్శిస్తారు. హల్లెలూయా! మీరు దానిని చూస్తున్నారా?
ఇంకను మీకేదైనా సందేహమున్నట్లైతే, ఆయనయొక్క ఆత్మచేత మిమ్మల్ని నింపి మరియు మిమ్మల్ని నడిపించమని దేవుడిని అడగండి, ఏలయనగా “ఏర్పరచబడినవారు మోసపరచబడలేరు,” అని వాక్యము చెప్పుచున్నది. మీరు గనుక వధువైనట్లైతే మిమ్మల్ని మోసపరిచగలవారు ఎవ్వరును లేరు.
మెథడిస్టులు విఫలమైనప్పుడు, దేవుడు ఇతరులను లేపాడు మరియు సంవత్సరాలుగా అది అట్లు కొనసాగినది, తుదకు ఈ చివరి దినమున మరలా వేరే ప్రజలు రంగం మీద ఉన్నారు వారు తమ వర్తమానికుని క్రింద చివరి కాలమునకు చివరి స్వరమైయుంటారు.
అవునండి. సంఘము ఇక ఎంతమాత్రము దేవుని “బూరగా” లేదు. అది దాని స్వంత బూరయైయున్నది. కావున దేవుడు ఆమెనుండి మరలుచుతున్నాడు. ఆయన ప్రవక్త ద్వారాను మరియు వధువు ద్వారాను దానిని కలవరపరచును, ఏలయనగా దేవునియొక్క స్వరము ఆమెలో ఉండును. అవును అది అంతే, ఏలయనగా ప్రకటన గ్రంథములోని చివరి అధ్యాయము 17వ వచనములో ఇట్లు చెప్పబడినది, “ఆత్మయు మరియు పెండ్లి కుమార్తెయు, రమ్ము అని చెప్పుచున్నారు.” పెంతెకొస్తు వద్ద ఉన్నట్లే ప్రపంచము మరొక్కసారి నేరుగా దేవుని యొద్దనుండి వింటుంది; అయితే అవును మొదటి కాలములో వలెనే ఆ వాక్యవధువు తిరస్కరించబడుతుంది.
వధువు ఒక స్వరమును కలిగియున్నది, అయితే అది టేపులలో ఉన్నదానిని మాత్రమే చెప్తుంది. ఏలయనగా ఆ స్వరము నేరుగా దేవుని యొద్దనుండి వచ్చినది, తద్వారా అది పరిపూర్ణముగా ఇవ్వబడి మరియు పరిపూర్ణముగా గ్రహించబడినది గనుక దానికి ఎటువంటి అనువాదము అవసరము లేదు.
ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమునకు, ఆ స్వరము మనకు దీనిని బయలుపరచడాన్ని వింటుండగా, వచ్చి మాతో చేరండి: లవొదికయ సంఘకాలము 60-1211E.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్